తొగుట( దుబ్బాక), వెలుగు: అంగన్వాడీ సెంటర్లో కుళ్లిన గుడ్లు తిని ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు, పేరెంట్స్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామంలోని అంగన్వాడీ సెంటర్–1 టీచర్ సత్యవతి మంగళవారం సెలవులో ఉండగా, ఆయా చిన్నారులకు ఉడకబెట్టిన గుడ్లను భోజనంలో పెట్టారు.
చిన్నారులు తిన్న గుడ్లు కుళ్లి పోవడంతో అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు అంగన్వాడీ సెంటర్ దగ్గర ఆందోళనకు దిగారు. నాసిరకం, కుళ్లిన గుడ్లు పెట్టి చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాంతులు చేసుకున్న చిన్నారులు ఆ తరువాత తేరుకోవడంతో పేరెంట్స్ కుదుటపడ్డారు.

