పెళ్లయిన వ్యక్తితో ప్రేమేంటని పెద్దలు మందలించినందుకు ఓ యువతి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాచకొండ పోలీస్ కమిషనర్ పరిధిలోని కుషాయిగూడ కృష్ణా నగర్ లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం..కుషాయిగూడలోని క్రిష్ణానగర్ లో దివ్యజ్యోతి (19)అనే యువతి రెండు సంవత్సరాల క్రితం ఓ వ్యక్తిని ప్రేమించింది. అతనికి వేరే అమ్మాయితో పెళ్లయింది.అయినా అతనితో రిలేషన్ కంటిన్యూ చేస్తుంది. ఈ విషయం తెలుసిన తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని చనిపోయింది.