గాంధీ ఆస్పత్రికి వచ్చిన బాలిక మిస్సింగ్

 గాంధీ ఆస్పత్రికి వచ్చిన బాలిక మిస్సింగ్

పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రికి వచ్చిన ఓ బాలిక కనిపించకుండా పోయింది. చిలకలగూడ ఎస్సై కిశోర్ తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్​లోని మదీనాగూడకు చెందిన కె. సాయిపూజ(14)ను ఈ నెల 18న  అమీర్ పేటలోని స్టేట్ హోం బ్రాంచ్ నుంచి గాంధీ ఆస్పత్రికి ఎస్కార్ట్​తో తీసుకొచ్చారు. అదే రోజు సాయిపూజ ఆస్పత్రి నుంచి తప్పించుకుంది. 

ఎక్కడ వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో స్టేట్ హోం ఎంప్లాయ్ ప్రవీణ బుధవారం చిలకలగూడ పీఎస్​లో కంప్లయింట్ చేసింది. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాయిపూజను ఎవరైనా గుర్తు పడితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.గాయాలతో అడ్మిట్ అయిన పేషెంట్ మిస్సింగ్ గాంధీ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఓ పేషెంట్ కనిపించకుండాపోయాడు. 

ఎస్సై కిశోర్ తెలిపిన వివరాల ప్రకారం..  సంగారెడ్డికి చెందిన మన్నె సురేశ్..​ యాక్సిడెంట్ గాయాలతో గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయి చికిత్స పొందుతున్నాడు.  గత నెల 29న సహాయకులతో కలిసి వార్డు నుంచి బయటికి వచ్చిన కనిపించకుండా పోయాడు.  ఎక్కడా వెతికినా సురేశ్ ఆచూకీ దొరకలేదని అతడి భార్య సుమలత బుధవారం చిలకలగూడ పీఎస్​లో కంప్లయింట్ చేసింది.