జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వండి.. మంత్రి మహేందర్ రెడ్డికి టీడబ్ల్యూజేఎఫ్ వినతి

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వండి.. మంత్రి మహేందర్ రెడ్డికి టీడబ్ల్యూజేఎఫ్ వినతి

హైదరాబాద్, వెలుగు: జర్నలిస్టులకు వెంటనే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మంగళవారం సమాచార శాఖ మంత్రి మహేందర్ రెడ్డిని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య, , కార్యదర్శి బసవ పున్నయ్య నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం అందించింది. ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం వేలాది మంది జర్నలిస్టులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తున్నారని గుర్తుచేశారు. కానీ,  హైదరాబాద్ తో పాటు పలు పట్టణాలు, నగరాల్లో పని చేస్తున్న జర్నలిస్టులకు మాత్రం ఇండ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియ జరగడం లేదని మంత్రి వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు ఐదారు వేల మంది జర్నలిస్టులు వివిధ హౌసింగ్ సొసైటీల్లో సభ్యులుగా ఉన్నారని, ఆయా సొసైటీలకు స్థలాలు కేటాయించాలని కోరారు.