వారు మాట్లాడిన భాషపై నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలె : కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి

వారు మాట్లాడిన భాషపై నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలె : కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై కేసులు నమోదు చేయాలని బీజేపీ కార్పోరేటర్లు డిమాండ్ చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి రెండు వారాలు గడుస్తున్నా కేసు నమోదు చేయలేదంటూ వారు డీజీపీని కలిశారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లను  దూషించారంటూ చేసిన ఫిర్యాదుపై ఏ చర్యలు తీసుకున్నారని డీజీపీని ప్రశ్నించారు. తాను సోషల్ మీడియాలో ట్విట్టర్ టిల్లు అని వ్యాఖ్యలు చేశానని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి, తనపై కేసును నమోదు చేశారని సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి విమర్శించారు.

తాను డీజే టిల్లు అని కేటీఆర్ ను ఉద్దేశించి అనలేదని శ్రీవాణి స్పష్టం చేశారు. కానీ కేసీఆర్, కేటీఆర్ లు మాట్లాడిన మాటలకు సంబంధించిన ఆధారాలను సైబర్ క్రైమ్ ఏసీపీకి అందజేసినా ఏ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మీడియా ముఖంగా దేశ ప్రధాని, కేంద్ర మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేయకపోతే... వారు మాట్లాడిన భాషపై నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు.