లూటీ సర్కార్లను​ ఇంటికి పంపాలి : ప్రమోద్​సావంత్​

లూటీ సర్కార్లను​ ఇంటికి పంపాలి : ప్రమోద్​సావంత్​
  • మెదక్ బీజేపీ ప్రచార సభలో గోవా సీఎం ప్రమోద్​ సావంత్​
  • హామీలు అమలు చేయని కాంగ్రెస్​పై తిరగబడండి 
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్​ రెడ్డి

మెదక్, వెలుగు : లూటీ సర్కార్లను ఇంటికి పంపాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్​సావంత్​పిలుపునిచ్చారు. తెలంగాణను పదేండ్లు బీఆర్ఎస్​దోచుకుంటే, ఇపుడు కాంగ్రెస్​దోచుకుంటోందన్నారు. మెదక్ లోక్​సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్​రావు నామినేషన్​సందర్భంగా గురువారం రాత్రి మెదక్​లో ర్యాలీ నిర్వహించి శివాజీ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభ నిర్వహించారు. ప్రమోద్​సావంత్​మాట్లాడుతూ డబ్బులు కలెక్ట్​ చేసే కలెక్టర్​వెంకట్రాంరెడ్డిని ఎమ్మెల్సీ చేసిన బీఆర్ఎస్​ ఇపుడు మరింత ఎక్కువ కలెక్షన్​చేసేందుకు ఎంపీ టికెట్​ఇచ్చిందని ఆరోపించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ప్రజల్ని మోసగించిన కాంగ్రెస్​ కు ఓట్లడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రచారానికి వచ్చే కాంగ్రెస్​నాయకులపై తిరగబడాలని, ఆరు గ్యారెంటీల గురించి నిలదీయాలని పిలుపునిచ్చారు. రాహుల్​ ప్రధాని కావడం కల అని, ఆయన ఇంకా ఇరవై ఏండ్లు కాంగ్రెస్​లీడర్​గా ఉంటే బీజేపీకి మేలు కలుగుతుందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్​ పోవడానికి పదేండ్లు పట్టిందని, కానీ, కాంగ్రెస్​ సర్కారు పోవడానికి చాలా తక్కువ టైం పడుతుందన్నారు.

మాజీ సీఎం కేసీఆర్​తన కూతురు నీతిమంతురాలని సుద్ద పూస మాటలు మాట్లాడుతున్నారని కిషన్​రెడ్డి ఎద్దేవా చేశారు. మెదక్​ లోక్​సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్​రావ్​మాట్లాడుతూ కాంగ్రెస్​ అభ్యర్థి కులాన్ని, బీఆర్ఎస్​అభ్యర్థి సూట్​కేసులను నమ్ముకుని ఎన్నికల్లో పోటీకి వస్తున్నారన్నారు. పోలీసులు లేకుండా హరీశ్​రావ్​, వెంకట్రామిరెడ్డిలకు మల్లన్నసాగర్​ముంపు గ్రామాల్లో పర్యటించే దమ్ముందా అని ప్రశ్నించారు. ‘దుబ్బాకలో చెల్లని రఘునందన్​రావ్​, మెదక్​లోక్​సభ ఎన్నికల్లో ఎలా చెల్లుతాడని మాజీ మంత్రిహరీశ్​రావ్​అంటున్నారు. నీ మామను రమ్మను మెదక్ లో పోటీ చేసేందుకు... ఛత్రపతి శివాజీ సాక్షిగా గోరీ కట్టకపోతే నేను రఘురాముడి వారసుడినే కాదు' అని అన్నారు. బీజేపీ మెదక్​, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్​, గోదావరి, మోహన్​ రెడ్డి పాల్గొన్నారు.