కాకా క్రికెట్ టోర్నీలో... గోదావరిఖని, యైటింక్లయిన్ టీమ్స్ గెలుపు

కాకా క్రికెట్ టోర్నీలో... గోదావరిఖని, యైటింక్లయిన్ టీమ్స్ గెలుపు

గోదావరిఖని/యైటింక్లయిన్ కాలనీ, వెలుగు : పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్ కాలనీలోని అబ్దుల్ కలాం స్టేడియంలో కాకా వెంకటస్వామి స్మారక రామగుండం నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నీ శనివారం కొనసాగింది. ఉదయం మొదటి మ్యాచ్ లో పాలకుర్తి, యైటింక్లయిన్​కాలనీ టీమ్స్ పోటీ పడగా యైటింక్లయిన్​కాలనీ జట్టు  విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాలకుర్తి టీమ్ 20  ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 119 రన్స్ చేసింది. తర్వాత బ్యాటింగ్​కు దిగిన యైటింక్లయిన్​కాలనీ జట్టు 8.4  ఓవర్లలోనే రెండు వికెట్లు నష్టపోయి 123 పరుగులు చేసి విజయం సాధించింది.

యైటింక్లయిన్​కాలనీ జట్టులో కలీ పవార్​ఇస్లావత్​ 24 బాల్స్​లోనే 56 రన్స్​చేయగా, రిషీ మాధవ్​10 బాల్స్​లో 25, ప్రవీణ్​రెడ్డి 13 బాల్స్​లో 28 రన్స్​చేశారు. ప్లేయర్ ఆఫ్​ ది మ్యాచ్​గా పవార్​ ఇస్లావత్​ ఎంపికయ్యారు. మధ్యాహ్నం జరిగిన మరో మ్యాచ్ లో అంతర్గాం, గోదావరిఖని జట్లు పోటీ పడ్డాయి. అంతర్గాం జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 131 రన్స్​చేసింది. తర్వాత బ్యాటింగ్​ ప్రారంభించిన గోదావరిఖని జట్టు 14.1 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 133 రన్స్ చేసి విజయం సాధించింది. క్రాంతి 47 బాల్స్​లో 60​, కన్నా 24 బాల్స్​లో 48 రన్స్​చేశారు. ఐదు వికెట్లు తీసిన గోదావరిఖని టీమ్ బౌలర్​మనోహర్​మణిపాలను ప్లేయర్​ ఆఫ్​ది మ్యాచ్​గా ఎంపికయ్యారు.