కాకా క్రికెట్​టోర్నీలో ..గోదావరిఖని, రామగుండం విజయం

కాకా క్రికెట్​టోర్నీలో ..గోదావరిఖని, రామగుండం విజయం

గోదావరిఖని/యైటింక్లయిన్​ కాలనీ: పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్​కాలనీలోని అబ్దుల్​కలాం స్టేడియంలో కాకా వెంకటస్వామి స్మారక రామగుండం నియోజకవర్గ స్థాయి క్రికెట్​టోర్నీ మంగళవారం ఉత్కంఠభరితంగా కొనసాగింది. ఉదయం మొదటి మ్యాచ్​యైటింక్లయిన్​కాలనీ, గోదావరిఖని జట్ల మధ్య జరగ్గా, గోదావరిఖని విజయం సాధించింది. 20 ఓవర్లలో యైటింక్లయిన్​ కాలనీ ఐదు వికెట్లు నష్టపోయి 162 రన్స్​ చేసింది. తర్వాత బ్యాటింగ్​కు దిగిన గోదావరిఖని 19 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 163 రన్స్​చేసి విక్టరీ కొట్టింది. 

గోదావరిఖని జట్టులో ప్రకాశ్​28 బంతుల్లో 37, యైటింక్లయిన్​కాలనీ జట్టులో డి.ప్రవీణ్​రెడ్డి 30 బాల్స్​లో 33 రన్స్​, మధు 31 బాల్స్​లో 33 రన్స్​చేసి ప్రతిభ కనబరిచారు. మధ్యాహ్నం జరిగిన రెండో మ్యాచ్​లో ఎన్టీపీసీ, రామగుండం జట్లు తలపడగా రామగుండం జట్టు గెలుపొందింది. మొదట బ్యాటింగ్​ ప్రారంభించిన ఎన్టీపీసీ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 రన్స్​చేయగా, తర్వాత బ్యాటింగ్​కు దిగిన రామగుండం 17.5 ఓవర్లలోనే ఐదు వికెట్లు నష్టపోయి 160 రన్స్​చేసి విజయం సాధించింది. ఎన్టీపీసీ జట్టులో జావీద్​48 బాల్స్​లో 70 రన్స్​, రామగుండం జట్టులో ప్రవీణ్​ 40 బాల్స్​లో 69 రన్స్, బాబర్​22 బాల్స్​లో 34 రన్స్​చేశారు.