Gold Rate: పసిడి ప్రియులకు గోల్డెన్ ఛాన్స్.. నేడు కుప్పకూలిన ధరలు, హైదరాబాద్ రేట్లివే..

Gold Rate: పసిడి ప్రియులకు గోల్డెన్ ఛాన్స్.. నేడు కుప్పకూలిన ధరలు, హైదరాబాద్ రేట్లివే..

Gold Price Today: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పూర్తిగా చల్లారటంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు తగ్గాయి. దీంతో ఇన్వెస్టర్లు హడావిడిగా బంగారం, వెండి వంటి ఖరీదైన లోహాలను కొనుగోలు చేయటం తగ్గించారు. ఇది వరుసగా పసిడి ధరలను తిరిగి సామాన్యులకు అందుబాటు స్థాయిల్లోకి వచ్చేందుకు దోహదపడుతోంది. నేడు ప్రజలు షాపింగ్ చేయటానికి ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన రిటైల్ ధరలను ముందుగా గమనించాలి.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.8వేల 500 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల 985, ముంబైలో రూ.8వేల 985, దిల్లీలో రూ.9వేలు, కలకత్తాలో రూ.8వేల 985, బెంగళూరులో రూ.8వేల 985, కేరళలో రూ.8వేల 985, వడోదరలో రూ.8వేల 990, జైపూరులో రూ.9వేలు, మంగళూరులో రూ.8వేల 985, నాశిక్ లో రూ.8వేల 988, మైసూరులో రూ.8వేల 985, అయోధ్యలో రూ.9వేలు, బళ్లారిలో రూ.8వేల 985, గురుగ్రాములో రూ.9వేలు, నోయిడాలో రూ.9వేల వద్ద కొనసాగుతున్నాయి. 

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు ఏకంగా రూ.9వేల 300 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ రేట్లను చూస్తే..  గ్రాముకు చెన్నైలో రూ.9వేల 802, ముంబైలో రూ.9వేల 802, దిల్లీలో రూ.9వేల 817, కలకత్తాలో రూ.9వేల 802, బెంగళూరులో రూ.9వేల 802, కేరళలో రూ.9వేల 802, వడోదరలో రూ.9వేల 807, జైపూరులో రూ.9వేల 817, మంగళూరులో రూ.9వేల 802, నాశిక్ లో రూ.9వేల 805, మైసూరులో రూ.9వేల 802, అయోధ్యలో రూ.9వేల 817, బళ్లారిలో రూ.9వేల 802, గురుగ్రాములో రూ.9వేల 817, నోయిడాలో రూ.9వేల 817గా ఉన్నాయి. 

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.89వేల 850 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.98వేల 020గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 17వేల 900 వద్ద ఉంది.