
ఇబ్రహీంపట్నం, వెలుగు: ఓ మహిళ అమెరికా వెళ్లొచ్చేసరికి ఆమె ఇంట్లోని ఆభరణాలు, విలువైన వస్తువులు చోరీ అయ్యాయి. ఈ ఘటన ఆదిభట్ల పోలీస్స్టేషన్పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రాఘవేందర్తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్మెట్మండలం తుర్కయాంజాల్కు చెందిన సోమరౌతు శ్రీలక్ష్మి గత ఏప్రిల్18న అమెరికాలో ఉన్న తన చిన్న కుమారుడి వద్దకు వెళ్లింది. ఈ నెల 19న తిరిగి వచ్చింది. బీరువాలోని 20 తులాల బంగారు ఆభరణాలు, ఒక ఐఫోన్, ఐప్యాడ్ తదితర వస్తువులు కనిపించకపోవడంతో దొంగతనం జరిగిందని నిర్ధారించుకొని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
పెద్ద కుమారుడి పనే?
ఇంట్లోని బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను చోరీ చేసింది బాధితురాలి పెద్ద కుమారుడేనని తెలిసింది. అతను ఆన్ లైన్బెట్టింగ్లకు అలవాటుపడి, అప్పులు చేశాడని, వాటిని తీర్చడం కోసం సొంతింటికే కన్నం వేసినట్లు సమాచారం.