సముద్ర మార్గం గుండా బంగారం అక్రమ రవాణా

సముద్ర మార్గం గుండా బంగారం అక్రమ రవాణా

శ్రీలంక నుంచి సముద్ర మార్గం గుండా భారత్ లోకి బంగారం అక్రమ రవాణా చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. రామేశ్వరం సమీపంలోని ఓ ఐల్యాండ్ దగ్గర సుమారు 6.8 కోట్ల విలువైన 17కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్ చేస్తున్న ఆశిక్ (22), బారుక్ (22) అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరు జీపీఎస్ ఆధారిత కిట్లలో బంగారాన్ని దాచి సముద్ర తీరంలో విసిరేస్తున్నారని చెప్పారు పోలీసులు. అనువైన సమయాలలో వెళ్లి తిరిగి తెచ్చుకుంటున్నారని అన్నారు. దీంతో పాటు తీర ప్రాంతం ఇసుకలో పూడ్చిపెడుతున్నారని చెప్పారు. వీరు జాలర్లుగా చెప్పుకుంటూ తమిళనాడుకు బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారని అన్నారు.