తెలంగాణలో గూగుల్ పెట్టుబడులు.. సీఎం రేవంత్ రెడ్డితో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చర్చలు

తెలంగాణలో గూగుల్ పెట్టుబడులు.. సీఎం రేవంత్ రెడ్డితో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చర్చలు

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక.. హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి  ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. తాజాగా టెక్నాలజీ మేజర్ గూగుల్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో గురువారం ( జనవరి11)  సీఎం రేవంత్ రెడ్డి, గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేకర్ తోట భేటీ అయ్యారు.


విద్య, ఆరోగ్యం కోసం సమగ్ర డిజిటలైజేషన్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్రంతో భాగస్వామ్యం కోసం సీఎం తో సమావేశమయ్యారు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట.తెలంగాణలో ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ వివిధ రంగాల్లో  పెట్టుబడి పెట్టేందుకు గూగుల్ సిద్ధంగా ఉందని చంద్రశేఖర్ తోట చెప్పారు. హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా Google Maps, google Earth ప్లాట్ ఫారమ్ లను ఉపయోగించి రహదారి భద్రత మెరుగు పర్చాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.