గూండాయిజం ఓడిపోయింది, ప్రజలు గెలిచారు : కేజ్రీవాల్

గూండాయిజం ఓడిపోయింది, ప్రజలు గెలిచారు : కేజ్రీవాల్

ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆప్ మరోసారి విజయ దుంధుభి మోగించింది. ఈ విజయంపై ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, అభ్యర్థి ఎంఎస్ ఒబెరాయ్, పార్టీ కార్మికులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. "గూండాలు ఓడిపోయాయారు, ప్రజలు గెలిచారు" అని కేజ్రీవాల్ చెప్పారు. మేయర్ ఎన్నికల్లో విజయం సాధించిన ఒబెరాయ్.. సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, లెఫ్టినెంట్ గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ చట్టం ప్రకారం నియమాలు, నిబంధనలు పాటిస్తానని హామీ ఇచ్చారు. ఢిల్లీ ప్రజల కలలను నెరవేర్చేందుకు అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. అంతకు ముందు అత్యంత రసవత్తరంగా సాగిన ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై 34  విజయం సాధించారు. ఒబెరాయ్ కు150ఓట్లతో ముందంజలో నిలవగా.. రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి.