శివరాత్రికి రిలీజ్ అవుతున్న గోపీచంద్ భీమా

శివరాత్రికి రిలీజ్ అవుతున్న గోపీచంద్ భీమా

గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు ఎ.హర్ష తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్  భీమా’.  కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇందులో పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గోపీచంద్ నటిస్తున్నాడు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నారు. సోమవారం ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేశారు. వాస్తవానికి ఫిబ్రవరి 16న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించగా, రీసెంట్‌‌‌‌‌‌‌‌గా ఇండస్ట్రీలో జరిగిన కొన్ని పరిణామాలు, ఇతర చిత్రాల రిలీజ్ డేట్స్‌‌‌‌‌‌‌‌లో మార్పుల కారణంగా  ‘భీమా’ సినిమాను  పోస్ట్ పోన్ చేశారు.

మార్చి 8న  మహా శివరాత్రి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.  ఈ సందర్భంగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెటప్‌‌‌‌‌‌‌‌లో ఇంటెన్స్‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తున్నాడు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అజ్జు మహంకాళి డైలాగ్స్ రాస్తున్నాడు.