గోపీచంద్ హీరోగా ఓ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శ్రీను వైట్ల. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి ఈ చిత్రంతో నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఇటలీ, గోవాలో రెండు షెడ్యూల్స్ పూర్తి చేశారు. తాజాగా హిమాలయాలలోని అద్భుతమైన ప్రదేశాలలో కీలక సన్నివేశాలు తీస్తున్నారు. శనివారం నుంచి ఈ లెంగ్తీ షెడ్యూల్ షూట్ ప్రారంభమైంది.
ఇందులో గోపీచంద్ మార్క్ యాక్షన్తో పాటు శ్రీను వైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెబుతున్నారు మేకర్స్. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి కె.వి. గుహన్ సినిమాటోగ్రాఫర్. గతంలో పలు సూపర్ హిట్ చిత్రాలకు శ్రీనువైట్లతో కలిసి వర్క్ చేసిన గోపీ మోహన్, దీనికి స్క్రీన్ప్లే అందిస్తున్నారు.హీరోయిన్ సహా ఇతర వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.