గోషామహల్‭కు క్యూ కట్టిన మందుబాబులు

గోషామహల్‭కు క్యూ కట్టిన మందుబాబులు

న్యూ ఇయర్ వేడుకల్లో పొట్టు పొట్టు తాగి పోలీసులకు దొరికిన మందుబాబులు ఈ రోజు గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్ట్సిట్యూట్‭కి క్యూ కట్టారు. థర్టీ ఫస్ట్ రోజు తప్పతాగి రోడ్లపై చిందులేసిన వారంతా ఈ రోజు కౌన్సిలింగ్ కు హాజరయ్యారు. తాగితే వదిలేది లేదని ముందే చెప్పిన పోలీసులు.. మందుబాబులపై కేసులు బుక్ చేశారు. న్యూ ఇయర్ కు ముందురోజు మందు తాగి బండ్లు నడిపిన వేలాదిమందిని పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‭లో పట్టుకుని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారంతా తమ వాహనాల కోసం గోషా మహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్ట్సిట్యూట్‭కి క్యూ కట్టారు. ప్రొసీజర్ ప్రకారం కౌన్సిలింగ్ కు అటెండయ్యారు.

థర్టీ ఫస్ట్ నైట్ మూడు కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. తాగి వాహనం నడిపిన 3,173 మందిపై ట్రాఫిక్ పోలీసులు కేసులు బుక్ చేశారు. హైదరాబాద్ పరిధిలో 1,413, రాచకొండ పరిధిలో 446 కేసులు, సైబరాబాద్ పరధిలో 1,314 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.