Farmhouse case:మరోసారి హైకోర్టును ఆశ్రయించిన సర్కార్

Farmhouse case:మరోసారి హైకోర్టును ఆశ్రయించిన సర్కార్

ఫాంహౌస్ కేసులో ప్రభుత్వం మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. గతంలో ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేయాలని ప్రభుత్వం సింగిల్ బెంచ్ను కోరింది. దీనిపై న్యాయస్థానం మధ్యాహ్నం విచారణ జరపనుంది. 

ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకు అప్పగిస్తూ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. అయితే డివిజన్ బెంచ్ సైతం సింగిల్ జడ్జి బెంచ్ తీర్పును సమర్థించింది. తీర్పు అమలుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ప్రభుత్వం మరోసారి హైకోర్టు సింగిల్ బెంచ్ ను ఆశ్రయించింది.