న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై అసభ్యకరమైన భాషను ఉపయోగించినందుకు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై తీర్మానం తీసుకురావాలనే ప్రణాళికను ప్రభుత్వం పక్కన పెట్టిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. రాహుల్వ్యవహారంపై ఇప్పటికే బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే (ఝార్ఖండ్) సబ్ స్టాంటివ్ మోషన్ నోటీసు ఇచ్చినందున.. ప్రభుత్వం తన సొంత తీర్మానాన్ని ప్రవేశపెట్టకుండా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని హౌస్ ప్రివిలేజ్ కమిటీకి, ఎథిక్స్ కమిటీకి పంపాలా? లేదా నేరుగా లోక్సభకు తీసుకురావాలా? అనే దానిపై స్పీకర్తో సంప్రదిస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కాగా, గురువారం బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, జీవితాంతం ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని డిమాండ్ చేస్తూ సబ్ స్టాంటివ్ తీర్మాన నోటీసు ఇచ్చానని చెప్పారు.
