పేదలు,వలస కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంది

పేదలు,వలస కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంది

రాష్ట్రంలో కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్. కరోనాను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ కొనసాగిస్తోందని…దీనికి అందరూ సహకరించాలన్నారు. ఇంటి నుంచి బయటకు రాకుండా సోషల్ డిస్టెన్స్ ను పాటిస్తూ కరోనాను తరిమికొట్టాలన్నారు.

కాప్రా సర్కిల్ ఏరియాలోని చర్లపల్లి డివిజన్లో నివసించే పేదలకు బియ్యం, నగదును అందించారు మేయర్ బొంతు రామ్మోహన్. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలను, వలస కార్మికులను ఆదుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏ ఒక్కరు కూడా ఆకలితో బాధపడకూడదనే ప్రభుత్వం నిత్యం కృషి చేస్తోందన్నారు. దానాలు చేసి పేదలను ఆదుకుంటున్న దాతలు, ఎన్జీవోలు కూడా అధికారులకు సమాచారం అందించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు మేయర్ బొంతు రామ్మోహన్.