మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి : జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్మోతె శ్రీలత శోభన్రెడ్డి

మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి : జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్మోతె శ్రీలత శోభన్రెడ్డి

ఉప్పల్, వెలుగు:​ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు  సీఎం రేవంత్​రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్​ప్రభుత్వం కృషి చేస్తోందని జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్​మోతె శ్రీలత శోభన్​రెడ్డి అన్నారు. ఆదివారం మాణికేశ్వర్​నగర్​లో ఎస్ హెచ్ జీ సభ్యులకు ఆమె ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర సర్కారు స్వయం సహాయక సంఘాల ద్వారా లోన్లు, ట్రైనింగ్, సెల్ఫ్​ ఎంప్లాయ్​మెంట్ తదితర అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 7.10 లక్షల మంది మహిళలకు చీరలతోపాటు అర్హులకు 40 ఎగ్​ కార్టులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల కమిటీ మెంబర్​ మోతె శోభన్ రెడ్డి, కాంగ్రెస్​సికింద్రాబాద్​నియోజకవర్గ ఇన్​చార్జి ఆడం సంతోష్​కుమార్, నాయకులు   తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.