కొందరు సచ్చిపోతా అని చెప్పి ఓట్లు అడిగిన్రు..గవర్నర్ కీలక వ్యాఖ్యలు..

కొందరు సచ్చిపోతా అని చెప్పి ఓట్లు అడిగిన్రు..గవర్నర్ కీలక వ్యాఖ్యలు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై గవర్నర్ తమిళి సై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని ఓ అభ్యర్థి అన్నారని ఎలక్షన్ కమిషన్ అలాంటి వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో  గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్లను ఎవరూ ఫోర్స్ చేయొద్దని సూచించారు. డెమోక్రసీ బతకాలి అంటే మంచి అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు. 

 ఓట్ వేయడం మన హక్కు అని గవర్నర్ అన్నారు. స్టేట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు మధ్య వారధిగా ఉండటం తన భాధ్యత అని చెప్పారు. హోమ్ ఓటింగ్ లో తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. ఓటింగ్ రోజు సెలవు సరదా కోసం కాదని యువత గుర్తించుకోవాలని సూచించారు. తాను నోటా ఓటుకు వ్యతిరేకమని చెప్పారు. ఓటర్ మోస్ట్ పవర్ ఫుల్ ఆయుధమని తెలిపారు. మంచి అభ్యర్థిని ఓటర్ ఎన్నుకుంటే మంచి పాలన అందుతుందని ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని గవర్నర్ తమిళి సై కోరారు.