తార్నాక సీసీఎంబీలో మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన గవర్నర్ 

తార్నాక సీసీఎంబీలో మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన గవర్నర్ 

హైదరాబాద్ : తార్నాకలోని సీసీఎంబీలో ఏర్పాటు చేసిన మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ ను తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ముఖ్య అతిథిగా హాజరై.. ప్రారంభించారు. అనంతరం మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు.

 

జన్యుపరమైన వ్యాధుల నిర్మూలనకు శాస్త్రవేత్తలు, పరిశోధన విద్యార్థులు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళి సై అభిప్రాయపడ్డారు. ఇటువంటి మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ల పరిశోధనను విద్యార్థులు మరింత  సద్వినియోగపర్చుకోవాలని సూచించారు. జన్యుపరమైన వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సీసీఎంబీలో మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు.