ప్రభుత్వం బోనాలకు ఆహ్వానించలేదు.. : గవర్నర్​ తమిళి సై

ప్రభుత్వం బోనాలకు ఆహ్వానించలేదు.. : గవర్నర్​ తమిళి సై

దేశ ప్రజలంతా సుఖ శాంతులతో సుభిక్షంగా ఉండాలని తెలంగాణ గవర్నర్​ తమిళిసై సౌందర రాజన్​ ఆకాంక్షించారు. జులై 16న ఆషాఢ మాసం బోనాల వేడుకలను ఆమె అధికారులతో కలిసి సెలబ్రేట్​ చేసుకున్నారు. రాజ్​భవన్​లోని నల్లపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. 

రాష్ట్ర ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.  ప్రభుత్వం అధికారికంగా బోనాల ఉత్సవాలకు  తనను ఆహ్వానించలేదని గవర్నర్​ అన్నారు. అందుకే రాజ్ భవన్లోనే వేడుకలు చేసుకున్నట్లు చెప్పారు.