దేశ ప్రజలంతా సుఖ శాంతులతో సుభిక్షంగా ఉండాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆకాంక్షించారు. జులై 16న ఆషాఢ మాసం బోనాల వేడుకలను ఆమె అధికారులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. రాజ్భవన్లోని నల్లపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
రాష్ట్ర ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అధికారికంగా బోనాల ఉత్సవాలకు తనను ఆహ్వానించలేదని గవర్నర్ అన్నారు. అందుకే రాజ్ భవన్లోనే వేడుకలు చేసుకున్నట్లు చెప్పారు.