హైదరాబాద్, వెలుగు : తెలంగాణ అసెంబ్లీని గవర్నర్ తమిళిసై సోమవారం రద్దు చేశారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి వచ్చిన రికమండేషన్ఆధారంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. మూడో శాసనసభను ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాశ్ కుమార్, సీఈఓ వికాస్ రాజ్తోపాటు ఇతర ఉన్నతాధికారులు రాజ్భవన్లో సోమవారం సాయంత్రం గవర్నర్ తమిళి సైని కలిశారు.
ఎన్నికలకు సంబంధించిన నివేదిక ఇవ్వడంతోపాటు గెజిట్ నోటిఫికేషన్ను అందించారు. దీంతో రెండో శాసనసభను గవర్నర్ రద్దు చేయడంతోపాటు, మూడో శాసనసభను ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీచేశారు. ఆ వెంటనే కొత్త ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ప్రమాణ స్వీకార ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది.