అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్.. మూడో శాసనసభను ఏర్పాటు చేస్తూ గెజిట్

అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్.. మూడో శాసనసభను ఏర్పాటు చేస్తూ గెజిట్

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ అసెంబ్లీని గవర్నర్​ తమిళిసై సోమవారం రద్దు చేశారు. కౌన్సిల్​ ఆఫ్​ మినిస్టర్స్​ నుంచి వచ్చిన రికమండేషన్​ఆధారంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. మూడో శాసనసభను ఏర్పాటు చేస్తూ గెజిట్​ నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్​ సెక్రటరీ అవినాశ్​ కుమార్, సీఈఓ వికాస్​ రాజ్​తోపాటు ఇతర ఉన్నతాధికారులు రాజ్​భవన్​లో సోమవారం సాయంత్రం గవర్నర్ తమిళి సైని కలిశారు.

ఎన్నికలకు సంబంధించిన నివేదిక ఇవ్వడంతోపాటు గెజిట్ నోటిఫికేషన్​ను అందించారు. దీంతో రెండో శాసనసభను గవర్నర్‌ రద్దు చేయడంతోపాటు, మూడో శాసనసభను ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీచేశారు. ఆ వెంటనే కొత్త ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ప్రమాణ స్వీకార ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది.