ప్రజాస్వామ్యంలో దాడులకు చోటులేదు

ప్రజాస్వామ్యంలో దాడులకు చోటులేదు

హైదరాబాద్, వెలుగు: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిపై గవర్నర్ తమిళిసై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఇలాంటి ఘటనలు దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీని గవర్నర్ ఆదేశించారు. అలాగే, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ప్రచార సమయంలో తగిన భద్రత కేటాయించాలని కోరారు. 

ఎన్నికలు పారదర్శకంగా జరగడానికి భద్రత కీలకమని గవర్నర్ గుర్తుచేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.