ఇక నుంచి రైళ్లోనే ప్రయాణిస్తా: గవర్నర్ తమిళిసై

 ఇక నుంచి రైళ్లోనే ప్రయాణిస్తా: గవర్నర్ తమిళిసై

సామాన్యుల కోసమే ప్రధాని మోదీ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. వేల కోట్లు వెచ్చించి రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారని చెప్పారు.  మంచి రైల్వే వ్యవస్థ ఉంటే విద్యార్థులు, రోగులు, వృద్ధులు ప్రయాణం సౌకర్యంగా, సురక్షితంగా జరుగుతుందన్నారు. అమృత్ భారత్ రైల్వే పథకం కింద  నాంపల్లి రైల్వే స్టేషన్ కు ఆధునికీకరణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ హాజరయ్యారు. 

నాంపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల ప్రారంభోత్సవంలో గవర్నర్ తమిళిసై తెలుగులో మాట్లాడారు. నాంపల్లి  రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు నిధులు కేటాయించినందుకు ప్రధాని మోదీకి ఆమె ధన్యవాదాలు  తెలిపారు. తాను తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా ఇకపై రైల్లోనే ప్రయాణిస్తానని చెప్పారు.