
పెండింగ్ బిల్లులపై తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. DME వయో పరిమితి బిల్లును తిరస్కరించిన గవర్నర్ .. మున్సిపల్ నింబంధనలు, ప్రైవేటు వర్సిటీల బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు.
గవర్నర్ బిల్లులను ఆమోదించకుండా కాలయాపన చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏప్రిల్ 24 సోమవారం రోజున దీనిపై విచారణ జరగనుంది. ఈనేపథ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం గవర్నర్ దగ్గర ఎలాంటి పెడింగ్ బిల్లులు లేదని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.
మొత్తం 10 బిల్లులకు గాను 3 ఆమోదించగా,2 రాష్ట్రపతి పరిశీలనకు, మరో రెండు వెనక్కి పంపారని, మూడు పెండింగ్ లో ఉన్నట్లుగా వెల్లడించారు.