ఇయ్యాల వేములవాడలో సద్దుల బతుకమ్మ

ఇయ్యాల వేములవాడలో సద్దుల బతుకమ్మ

వేములవాడ  : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శనివారమే సద్దుల బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజులకు సదుల బతుకమ్మ వేడుకలు జరిగితే వేములవాడలో మాత్రం సప్తమాత్రుకల ఆధారంగా 7 రోజులకే జరగనున్నాయి.

బ్రాహ్వి,  మహేశ్వరి, కౌమరి, వైష్ణవి, వారాహి, ఇంధ్రణి, శాముండ, తదితర అమ్మవారి పేర్ల అధారంగా వేద పండింతుల సూచన మేరకు 7 రోజులకే అనాదిగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు గవర్నర్ తమిళిసై హాజరు కానున్నారు.   గవర్నర్ సాయంత్రం గంటలకు వేములవాడకు చేరుకుంటారు.  7 గంటలకు రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు.  రాత్రి 8 గంటలకు మూలవాగు వద్ద బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు.