న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా పని చేసిందని తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పారు. కరోనా కంట్రోల్ చేసేందుకు రాష్ట్రాలకు అన్ని విధాలుగా కేంద్రం సహకరించిందని తెలిపారు. మందులు, ఆక్సిజన్ సరఫరా సహా అన్ని విషయాలను కేంద్రం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసిందన్నారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్.. లోక్కల్యాణ్ మార్గ్–7లోని ప్రధాని నివాసంలో మోడీని కలిశారు. కరోనా సమయంలో నరేంద్ర మోడీ తీసుకున్న చర్యలను వివరిస్తూ ఆమె రాసిన పుస్తకం ‘పీఎం అండ్ పీఎం’ (ప్రైమ్ మినిస్టర్ అండ్ పాండమిక్ మేనేజ్మెంట్)ను మోడీకి తమిళి సై అందజేశారు. సుమారు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై ప్రధానితో చర్చించారు. ప్రధానితో భేటీ తరువాత ఆమె తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కరోనా ఎఫెక్ట్ తర్వాత ఫస్ట్ టైమ్ ప్రధానిని కలిశానని, తాను రాసిన పీఎం అండ్ పీఎం బుక్పై మోడీ సంతోషపడ్డారని తమిళి సై చెప్పారు. పాండెమిక్ టైంలో కేంద్రం తీసుకున్న ప్రతి చర్య గురించి పుస్తకంలో రాయడాన్ని పీఎం అభినందించారన్నారు. రాష్ట్ర గవర్నర్గా ఆరోగ్య, ఆర్థిక తెలంగాణ (హెల్తీ, వెల్దీ తెలంగాణ) కోసం కృషి చేస్తున్నట్లు తమిళి సై తెలిపారు. గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన రోజే.. తాను తమిళనాడు డాటర్, తెలంగాణ సిస్టర్ అని చెప్పానని గుర్తు చేశారు. రాష్ట్రంలోని గిరిజనుల్లో పౌష్టికాహార లోపం ఉందని, దాన్ని అధిగమించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ వెళ్లారు. దేశ గొప్పతనం, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని తమిళిసై పిలుపునిచ్చారు. ఫ్రీడర్ ఫైటర్స్పై ఇతిహాస సంకల్ప సమితి రూపొందించిన పోస్టల్ స్టాంప్స్ను ఆన్లైన్ ద్వారా రిలీజ్ చేశారు.
ప్రధానిపై గవర్నర్ తమిళిసై బుక్
- తెలంగాణం
- August 13, 2021
లేటెస్ట్
- Josh Baker: 20 ఏళ్లకే లోకాన్ని విడిచాడు.. క్రికెటర్ అనుమానాస్పద మృతి
- ప్రశ్నించే గొంతుక కాబట్టే అందరూ దగ్గరుండి గెలిపించారు: సీఎం రేవంత్ రెడ్డి
- వెస్ట్ బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు
- Devon Thomas: మ్యాచ్ ఫిక్సింగ్.. వెస్టిండీస్ క్రికెటర్పై ఐదేళ్ల నిషేధం
- సెక్స్ స్కాండల్ కేసులో.. ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ అవుట్ నోటీసులు
- Sreemukhi: ఫొటోషూట్లో హొయలొలికిస్తున్న శ్రీముఖి..సింప్లీ సూపర్బ్..చూపులతో చంపేస్తున్నావ్
- ఉపాధి హామీ కూలీ రేట్లు పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు
- బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు : ఉత్తమ్ కుమార్ రెడ్డి
- SRH vs RR: తెలుగు కుర్రాడు మెరుపులు.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం
- జగన్ నవరత్నాలకు పోటీగా కేఏ పాల్ దశరత్నాలు..
Most Read News
- ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- Ben Wells: అరుదైన గుండె జబ్బు.. 23 ఏళ్లకే క్రికెట్కు గుడ్ బై
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
- ప్రైవేట్ ట్రావెల్స్ లో.. రూ.2 కోట్ల 40 లక్షలు పట్టివేత.. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి..