బంజారాహిల్స్లో 30 మీటర్ల  బిల్డింగ్ కు ఓకే .. జీవో ఇచ్చిన సర్కారు 

బంజారాహిల్స్లో 30 మీటర్ల  బిల్డింగ్ కు ఓకే .. జీవో ఇచ్చిన సర్కారు 

హైదరాబాద్ సిటీ, వెలుగు: బంజారాహిల్స్ లో నిఖిల్ కరణ్ కి సంబంధించిన స్టిల్ట్ ఫ్లోర్లను మినహాయింపుతో 10అంతస్తులు, రెండు అదనపు టీడీఆర్ ఫ్లోర్లతో 30 మీటర్ల తో కూడిన భవనానికి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. డోర్ నంబర్ 8-2-618/3 వద్ద ఈ బిల్డింగ్​నిర్మాణాన్ని రొక్సానా ప్రాపర్టీస్ సంస్థ చేపట్టింది. 6166.06 చ.మీ స్థలంలో ఈ నిర్మాణం జరగనున్నది. 45 మీటర్ల ఎత్తుతో భవనాన్ని నిర్మించుకునేందుకు అనుమతి కోరగా, 30 మీటర్ల వరకు నిర్మించుకునేందుకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

 హై రైజ్ బిల్డింగ్స్ రూల్స్​ప్రకారం అన్ని రూల్స్​పాటించాలని, ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ నుంచి ఎన్ వోసీ పొందాలని, ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవాలని కోరింది. తదుపరి చర్యలు తీసుకోవాలని జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ కమిషనర్‌‌‌‌‌‌‌‌కు ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఉత్తర్వులు ఇచ్చారు.