
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైటెక్ సిటీ కోహినూర్ లో దుర్గామాత నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా బుధవారం కోహినూర్ బై ఆరో ‘నవదుర్గా స్వరూపిణి’ పేరుతో ప్రత్యేక భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.
హోప్ అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో జరిగిన ఈ వేడుకలో భక్తి గీతాలు శ్రోతలను ఆధ్మాత్మికంలో ముంచెత్తాయి. ప్రతిమశశిధర్ గాత్రం ఆకట్టుకుంది. భక్తిగీతాల నేపథ్యాన్ని, ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని మహీధర సీతారామశర్మ వివరించారు. అనంతరం కోహినూర్ నిర్వాసితులు కళాకారులను సత్కరించారు.