మార్చి 27న ప్రియదర్శి సుయోధన సినిమా రిలీజ్

మార్చి 27న ప్రియదర్శి సుయోధన సినిమా రిలీజ్

ప్రియదర్శి హీరోగా నటించిన తాజా చిత్రం ‘సుయోధన’.  వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో  బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు.  ద్రిషిక చందర్  హీరోయిన్‌‌‌‌గా నటించగా, సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్ర పోషించారు. శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా  మార్చి 27న సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 

ఈ సందర్భంగా నిర్మాత బోసుబాబు మాట్లాడుతూ ‘మంచి కథ కథానాలతో అత్యుత్తమ  ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రూపొందించాం. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం.  త్వరలోనే  టీజర్, ట్రైలర్, పాటలను రిలీజ్ చేస్తాం’ అని అన్నారు.  జై క్రిష్ సంగీతం అందించాడు.