
కోరుట్ల, వెలుగు: కోరుట్లలో ఆదివారం పెద్దాపూర్ఇస్కాన్ టెంపుల్ఆధ్వర్యంలో జగన్నాథుడి రథయాత్ర వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి రథయాత్ర ప్రారంభించి ఐబీరోడ్డు , గోదాంరోడ్డు, కార్గిల్ చౌరస్తా , కొత్త బస్టాండ్ జాతీయ రహదారి మీదుగా వాసవి కల్యాణ భవనం వరకు ఈ యాత్ర కొనసాగింది. రథయాత్రలో భక్తులు హరే కృష్ణ, హరే రామ అంటూ సంకీర్తనలు చేస్తూ రథాన్ని లాగారు. కార్యక్రమంలో ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు పాల్గొన్నారు.