అహ్మదాబాద్కు భారత్ జట్టు..రసవత్తరంగా మూడో టీ20

అహ్మదాబాద్కు భారత్ జట్టు..రసవత్తరంగా మూడో టీ20

భారత్, న్యూజిలాండ్ మధ్య చివరి టీ20 బుధవారం జరగనుంది. మూడు మ్యాచుల సిరీస్లో భాగంగా ఇప్పటికే చెరోటి గెలవడంతో చివరి మ్యాచ్ రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మూడో టీ20 ఆడేందుకు టీమిండియా అహ్మదాబాద్కు చేరుకుంది.  అహ్మదాబాద్కు చేరుకున్న భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. కోచ్ రాహుల్ ద్రవిడ్తో పాటు కెప్టెన్ హార్దిక్ పాండ్య, ఇతర జట్టు సభ్యులంతా ప్రత్యేక బస్సులో హోటల్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా హోటల్ సిబ్బంది  క్రికెటర్లందరికి శాలువాలు కప్పుతూ గ్రాండ్గా వెల్ కమ్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో షేర్ చేసింది. న్యూజిలాండ్తో జరిగే మూడో టీ20 కోసం అహ్మదాబాద్కు చేరుకున్నామని క్యాప్షన్ ఇచ్చింది.