
కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటుకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను త్వరగా సిద్ధం చేయాలని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం బల్దియా హెడ్ఆఫీస్లో మేయర్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు కోసం రూపొందిస్తున్న రిపోర్ట్ పురోగతిని బిల్డ్ కాన్ కన్సల్టెన్సీ అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు.