కాశీబుగ్గలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డీపీఆర్ సిద్ధం చేయండి : గుండు సుధారాణి

కాశీబుగ్గలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డీపీఆర్ సిద్ధం చేయండి : గుండు సుధారాణి

కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు: అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటుకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను త్వరగా సిద్ధం చేయాలని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. 

మంగళవారం సాయంత్రం బల్దియా హెడ్​ఆఫీస్​లో మేయర్ మున్సిపల్​ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీవరేజ్​ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు కోసం రూపొందిస్తున్న రిపోర్ట్ పురోగతిని బిల్డ్ కాన్ కన్సల్టెన్సీ అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు.