మైక్రో పార్కు పిల్లలకు ఎంతో ఉపయోగం

మైక్రో పార్కు పిల్లలకు ఎంతో ఉపయోగం

కాశీబుగ్గ/కార్పొరేషన్, వెలుగు: గ్రేటర్​ వరంగల్​ మున్సిపల్​ కార్పొరేషన్​13వ డివిజన్​లోని ఎంహెచ్​నగర్​లో చిల్డ్రన్​ మైక్రో పార్కును 56 గంటల్లో ఏర్పాటు చేశారు. బల్దియా మేయర్​గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్యతో కలిసి బుధవారం పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్​ మాట్లాడుతూ ఆజాదికా అమృత్​మహోత్సవ్​లో భాగంగా 75 గంటల్లో మైక్రో పార్కు ఏర్పాటు చేయాలని టార్గెట్​గా పెట్టుకోగా 56 గంటల్లోనే పనులు పూర్తి చేశామన్నారు. అనంతరం కమిషనర్​ మాట్లాడుతూ ఇక్కడ నివసించే 200 నుంచి 300 మంది పిల్లలకి పార్కు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.