- ఆర్టీఏ వెబ్సైట్లో క్ కాని స్లాట్
- మీ సేవ కేంద్రాల్లోనూ కనిపించని గ్రీన్ ట్యాక్స్ ఆప్షన్స్
- లేటయితే జరిమానాలతో బాదుడు
హైదరాబాద్సిటీ, వెలుగు : గ్రేటర్లో గడువు తీరిన వాహనాలను గ్రీన్ట్యాక్స్తో రెన్యూవల్ చేయించుకోవడానికి వాహనదారులు తిప్పలు పడాల్సి వస్తున్నది.15 ఏండ్లు పూర్తి చేసుకున్న వాహనం ఏదైనా (ఈవీ, సీఎన్జీ మినహా) గ్రీన్టాక్స్ చెల్లిస్తే ఐదేండ్ల పాటు బండి నడుపుకోవడానికి అనుమతినిస్తారు.
కానీ, సిటీ ఆర్టీఏ కేంద్రాలతో పాటు మీసేవ కేంద్రాల్లో సర్వర్ డౌన్ కావడం, గ్రీన్ట్యాక్స్ ఆప్షన్ కనిపించకపోవడం, ఇతర కారణాలతో రెన్యూవల్ చేయించుకోవాలంటే కావడం లేదు. దీంతో గడువు దాటిందంటూ ప్రతి వాహనంపై నెలకు రూ.500 చొప్పున ఫైన్ వేస్తున్నారు. గడువు ముగిసి నెల పూర్తి కాకపోయినా, రోజులు గడిచినా ముక్కుపిండి మరీ జరిమానా వసూలు చేస్తున్నారు.
గడువు దాటినవి 27వేలు
ప్రస్తుతం గ్రేటర్పరిధిలో కాలం చెల్లిన వాహనాల్లో దాదాపు17 వేల వరకు టూ వీలర్లు, మరో 10వేల వరకు కార్లు, ఇతర వాహనాలున్నాయి. టూ వీలర్లకు రూ.2వేలు, కార్లకు రూ.5వేలు, ఇతర భారీ వాహనాలకు రూ.10వేలు గ్రీన్ ట్యాక్స్గా చెల్లిస్తే ఆర్టీఏ ఫిట్నెస్సర్టిఫికెట్ఇచ్చి అనుమతినిస్తుంది. అయితే, గడువు దాటి ఒకటి, రెండు నెలలు దాటినవారు తమ వాహనాలను రెన్యూవల్ చేయించుకోవడానికి ఆసక్తితో ఉన్నా టెక్నికల్సమస్యలు వెంటాడుతున్నాయి.
ఆర్టీఏ వెబ్సైట్లో స్లాట్ బుక్ కావడం లేదు. అదృష్టవశాత్తు స్లాట్బుక్ అయినా డబ్బులు కడదామంటే ఓటీపీ రావడం లేదు. కొందరికి పేమెంట్గేట్వేలు నిలిచిపోయి రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నది. మీ సేవా కేంద్రాల్లోనూ గ్రీన్ ట్యాక్స్ఆప్షన్స్ రావడం లేదు. పలు సెంటర్లలో సర్వర్డౌన్ కావడమో లేక డేటా నాట్ ఫౌండ్ అనో వస్తోంది. ఈ విషయమై ఆర్టీఏ అధికారులను సంప్రదిస్తే సాంకేతి సమస్యలను సరిచేస్తున్నట్టు చెప్తున్నారు. ఈ సేవా కేంద్రాల్లో మాత్రం సర్వర్ డౌన్ కావడం, సాంకేతిక సమస్యలకు తమకు సంబంధం లేదని చెప్తున్నారు.
గడువులోపు చెల్లిస్తేనే ఇన్సూరెన్స్
వాహనాల గడువు ముగింపులోపు గ్రీన్ట్యాక్స్ చెల్లిస్తేనే ఇన్సూరెన్స్ వంటివి వర్తిస్తాయని, గడువు తీరాక కడితే ఇన్సూరెన్స్వర్తించదని ఆర్టీఏ అధికారులు చెప్తున్నారు. దీనివల్ల కూడా చాలామంది గ్రీన్ట్యాక్స్కట్టడానికి ఆసక్తి చూపడం లేదు. జరిమానాతో గ్రీన్ట్యాక్స్ కట్టించుకున్నప్పుడు ఇన్స్యూరెన్స్ కూడా వర్తించేలా చేయాలని వాదిస్తున్నారు. బీమా లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే అటు ప్రమాదానికి గురైన వారితో పాటు నడిపిన వారికి కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు.
జరిమానా ఎక్కువని కడ్తలేరు
రెన్యూవల్ చేయించుకోని వారికి రూ.నెలకు 500 చొప్పున ఫైన్లు వేస్తుండడంతో చాలామంది తమ వాహనాలకు గ్రీన్ట్యాక్స్కట్టడం లేదు. ఉదాహరణకు ఒక టూ వీలర్గడువు ముగిసి రెండేండ్లు అయ్యిందనుకుంటే అతడు నెలకు రూ. 500 చొప్పున రెండేండ్లకు రూ.12 వేలు జరిమానా కట్టాల్సి వస్తున్నది. అలాగే వీటితో పాటు గ్రీన్ ట్యాక్స్ రూ.2వేలు కలిపి రూ.14వేలు చెల్లించాలి. ఇంకా మూడేండ్లు, నాలుగేండ్లు దాటినవి అయితే ఇంకా భారీగానే ముట్టజెప్పాలి.
ఇలాంటి వాహనాలు నగరంలో వేల సంఖ్యలోనే ఉన్నాయి. అంతంత జరిమానాలు కట్టే బదులు దొరికినప్పుడు చూసుకుందాం లే అని లైట్ తీస్కుంటున్నారు. ఇలాంటి వాహనాల విషయంలో అధికారులు వెసులుబాటు కల్పించి జరిమానా మాఫీ చేయడమో, లేదా తగ్గించడమో చేస్తే బాగుంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీని వల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుందంటున్నారు.
