జమ్మూ కశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రమూకలు

జమ్మూ కశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రమూకలు

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అనంతనాగ్ డీసీపీ కార్యాలయం దగ్గర గ్రెనెడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు పౌరులు గాయపడ్డారు. భద్రతా బలగాలు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఉగ్రదాడి ఘటనతో అప్రమత్తమైన జవాన్లు అనంతనాగ్ లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. సెక్యూరిటీ బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి చేశారని జమ్మూ కశ్మీర్ పోలీసులు చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాదులు దాడి చేయడం ఇది రెండోసారి. గత నెల 28న శ్రీనగర్ లో CRPF జవాన్లు టార్గెట్ గా గ్రెనెడ్ దాడికి పాల్పడ్డారు.