రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రాష్ట్రంలో నిరుడు అక్టోబర్ నుంచి 54 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం, సూపర్ ఎల్నినో ఎఫెక్ట్తో మార్చిలోనే ఎండలు మండిపోతుండటంతో ప్రధాన జలాశయాల్లోని వాటర్ లెవల్స్ వేగంగా పడిపోతున్నాయి
జనవరి నుంచే పడిపోతున్న గ్రౌండ్ వాటర్
ఈ ఏడాది జనవరి నుంచే రాష్ట్రవ్యాప్తంగా గ్రౌండ్వాటర్ లెవల్స్ పడిపోతు న్నట్టు భూగర్భ జలవనరుల శాఖ తేల్చింది. జనవరిలో సగటు నీటిమట్టం 6.22 మీటర్లు కాగా.. ఇప్పటికే 7.72 మీటర్ల లోతుకు పడిపోయాయి. నిజామాబాద్ జిల్లా గోనుగుప్పులలో ఏకంగా 27.63 మీటర్ల లోతుకు పడిపోయాయి. నిరుడు అక్టోబర్ నుంచి సగటు వర్షపాతం నమోదు కాకపోవడంతో ప్రాజెక్టుల్లో నీళ్లు తగ్గుతూ రావడం, చెరువులు ఎండిపోవడంతో రైతులు తమ పంటలు కాపాడు కునేందుకు బోర్లపై ఆధారపడుతున్నారు. ఈ యాసంగిలో 62.89 లక్షల ఎకరా ల్లో రైతులు పంటలు సాగుచేయగా
అందులో అత్యధికంగా 47.88 లక్షల ఎక రాల్లో వరి వేశారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థి తులపై రైతులకు అవగా హన కల్పించి, వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగుచే యించాల్సిన వ్యవసాయాధి కారులు ఈ విషయంలో నిర్లక్ష్యం చేశారు. ఫలి తంగా యాసంగిలో వరిసాగుచేసిన రైతులంతా పంటలను కాపాడుకునేందు కు జనవరి, ఫిబ్రవరి నెలల్లో బోర్లను నిరంతరంగా నడిపించారు. దీంతో భూగర్భజలాలు అడుగంటి, మార్చి ప్రారంభం నాటికి కోతకు వచ్చే దశలో పంటలు ఎండిపోతున్నాయి.