గుజరాత్ ఎగ్జామ్ పేపర్ హైదరాబాద్లో లీక్

గుజరాత్ ఎగ్జామ్ పేపర్ హైదరాబాద్లో లీక్

గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన ఎగ్జామ్ పేపర్ హైదరాబాద్‌లో లీక్ అవడం కలకలం రేపుతోంది. పరీక్షకు సరిగ్గా రెండు గంటల ముందు పంచాయతీ రాజ్ క్లర్క్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ కావడంతో గుజరాత్ ప్రభుత్వం పరీక్షను రద్దు చేసింది. ఈ పరీక్షకు హైదరాబాద్‌తో పాటు ఆంధ్రాలోనూ పేపర్లు ప్రింట్ అయ్యాయి. ఒడిశాకు చెందిన ప్రదీప్ నాయక్‌ పేపర్ లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. జీతు నాయక్ అనే వ్యక్తికి ప్రదీప్ క్వశ్చన్ పేపర్ అందజేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో జీతునాయక్ సహా 15మందిని గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట చేశారు. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రాలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.