అహ్మదాబాద్: ఐపీఎల్19లో భాగంగా ఆదివారం పంజాబ్కింగ్స్, గుజరాత్టైటాన్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్హ్యాట్రిక్విజయం సాధించింది. పంజాబ్నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని (19.5) ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాస్ఓడి మొదట బ్యాటింగ్చేపట్టిన పంజాబ్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సిరాజ్వేసిన మొదటి ఓవర్లోనే ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కానోలీ అవుట్ అయ్యారు. దీంతో సూర్యాన్ష్ షెడ్జ్ (29 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 57), మార్కస్ స్టోయినిస్ ( 31బంతుల్లో 5ఫోర్లు,1 సిక్స్ తో40 ) పరుగులతో రాణించారు.
చివర్లో మార్కో జాన్సెన్బ్యాట్ఝులిపించడంతో పంజాబ్ఆ స్కోరైనా చేయగలిగింది. సిరాజ్ (2/28), హోల్డర్ (4/24) , రబడ 2/22 పోటీపడి వికెట్లు తీశారు. అనంతరం ఛేజింగ్కు దిగిన గుజరాత్సాయి సుదర్శన్ (41 బంతుల్లో 5 ఫోర్లు,1 సిక్స్తో 57), వాషింగ్టన్సుందర్ ( 23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్తో 40) పరుగులతో చెలరేగారు. హోల్డర్కు 'మ్యాన్ఆఫ్ద ప్లేయర్' దక్కింది.
కుప్పకూలిన పంజాబ్ టాప్ ఆర్డర్
సిరాజ్, హోల్డర్ ధాటికి పంజాబ్ 8.4 ఓవర్లలో 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో సూర్యాన్ష్ షెడ్జ్ (29 బంతుల్లో 57), మార్కస్ స్టోయినిస్ (40) ఆరో వికెట్కు 79 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. షెడ్జ్ గుజరాత్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ అవకాశం దొరికినప్పుడల్లా బ్యాట్ ఝులిపించాడు. మానవ్ సుతార్ వేసిన 14వ ఓవర్లో వరుసగా 6, 6, 4, 4, 6 బాది మొత్తం 26 పరుగులు రాబట్టాడు.
కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే రబడ (2/22) బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం హోల్డర్ రంగంలోకి దిగి నెహాల్ వధేరా, పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను పెవిలియన్ పంపాడు. వధేరా వికెట్ కీపర్కు దొరికిపోగా, శ్రేయస్ అయ్యర్ బంతిని థర్డ్ మ్యాన్ దిశగా మళ్లించే క్రమంలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివరకు పంజాబ్20 ఓవరల్లో 9 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.
చివరి బంతి వరకు ఉత్కంఠ..
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ తొలి ఓవర్లోనే 12 పరుగులు రాబట్టింది. జట్టు స్కోరు 16 పరుగుల వద్ద కెప్టెన్శుభమన్గిల్అర్షదీప్బౌలింగ్లో కనోలికి క్యాచ్ఇచ్చి అవుట్అయ్యాడు. క్రీజులోకి వచ్చిన జోస్బట్లర్మరో ఓపెనర్సాయి సుదర్శన్తో జత కట్టాడు. వీరిద్దరూ కలిసి 40 బంతుల్లో 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం బట్లర్(22 బంతుల్లో 1ఫోర్, 2 సిక్స్లతో 26) విజయ్వైశాఖ్ బౌలింగ్లో శ్రేయస్కు క్యాచ్ఇచ్చి వెనుదిరిగాడు.
10 ఓవర్లకు గుజరాత్2 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. 11 ఓవర్లో నిశాంత్సింధు (15) స్టోయినిస్బౌలింగ్లో క్యాచ్అవుట్అయ్యాడు. ఈ క్రమంలో సాయి సుదర్శన్37 బంతుల్లో హాఫ్సెంచరీ పూర్తి చేశాడు. 14 ఓవర్లో సుదర్శన్ (41 బంతుల్లో 5 ఫోర్లు,1 సిక్స్తో 57) విజయ్ బౌలింగ్లో బార్ట్లెట్కు చిక్కాడు. విజయానికి చివరి ఓవర్లో 11 పరుగులు రాబట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో వాషింగ్టన్సుందర్( 23 బంతుల్లో 40 ) ఐదో బంతిని సిక్స్గా మలిచి విజయాన్ని ఖాయం చేశాడు.
సంక్షిప్త స్కోర్లు:
పంజాబ్కింగ్స్ : 20 ఓవర్లలో 163/9 (షెడ్జ్57, స్టోయినిస్40, జాసన్హోల్డర్4/24.
గుజరాత్ టైటాన్స్ : 19.1 ఓవర్లలో 167/ 6 ( సుదర్శన్ 57, సుందర్ 40, అర్ష్దీప్సింగ్2/24
