Kadapa : సీఎం నియోజకవర్గంలో కాల్పులు.. వైఎస్ వివేకా హత్య కేసుతో లింకేంటీ

Kadapa : సీఎం నియోజకవర్గంలో కాల్పులు.. వైఎస్ వివేకా హత్య కేసుతో లింకేంటీ

ఏపీ సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. మార్చి 28వ తేదీ మంగళవారం మధ్యాహ్నం.. పులివెందులలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో భరత్ కుమార్ అనే యువకుడు.. మరో ఇద్దరిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో దిలీప్, మహబూబ్ భాషాలకు తీవ్ర గాయాలయ్యాయి. శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. కాల్పుల శబ్దంతో స్థానికులు పరిగెత్తుకుని రావటంతో నిందితుడు భరత్ కుమార్ అక్కడి నుంచి పారిపోయాడు. 

కాల్పులు జరిపిన భరత్ కుమార్ .. గాయపడిన దిలీప్ మధ్య కొన్నాళ్లుగా డబ్బుల వివాదం నడుస్తుందని.. ఈ క్రమంలోనే గొడవ జరిగిందని.. మాటా మాటా పెరిగి కాల్పుల వరకు వెళ్లినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టం అయినట్లు చెబుతున్నారు పోలీసులు. ఇంట్లోని తుపాకీ తీసుకొచ్చి మరీ కాల్చాడని.. భరత్ దగ్గర ఉన్న గన్ కు లైసెన్స్ ఉందా లేదా అనే విషయంపైనా విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు పోలీసులు. 

ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. కాల్పులు జరిపిన భరత్ కుమార్ యాదవ్ ను.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు గతంలో విచారించారు. గాయపడిన దిలీప్ పరిస్థితి విషమంగా ఉండటంతో.. అతన్ని కడప రిమ్స్ ఆస్పత్రికి తరలిం