మోపాల్, వెలుగు: నిరంతరం ప్రజల్లో ఉంటూ, కాంగ్రెస్పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న తనను మండలాధ్యక్ష పదవి నుంచి తొలగించే హక్కు మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి ఎవరిచ్చారని గున్నే రవి ప్రశ్నించారు. ఇటీవల జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో సాయిరెడ్డిని నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు నాయకులు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో గున్నె రవి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహిచి, వారి నిర్ణయాన్ని ఖండించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఇతర ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని, ఎవరో వచ్చి తొలిగిస్తామంటే ఊరుకునేది లేదన్నారు.