
నల్గొండ అర్బన్, వెలుగు: రాబోయే ఎన్నికల్లో లెఫ్ట్పార్టీలతో కలిసి బీఆర్ఎస్ ఎన్నికలకు వెళ్తుందని శాసనమండలి చైర్మన్గుత్తా సుఖేందర్రెడ్డి చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ మార్చే అవకాశముందన్నారు. మండలి సమావేశాలు నాలుగు రోజుల పాటు సక్సెస్ఫుల్గా జరిగాయని, సభలో వివిధ బిల్లులను పాస్ చేశామన్నారు. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం హర్షణీయమన్నారు. బుధవారం నల్లగొండలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు డైరెక్షన్లో నడిచే రేవంత్, కాంగ్రెస్ నాయకులకు అధికారం, స్వలాభం తప్ప తెలంగాణ అభివృద్ధి పట్టదని ఆరోపించారు.
సీఎం కేసీఆర్నాయకత్వంలో తొమ్మిదిన్నరేండ్ల పాలనలో తెలంగాణ సుభిక్షంగా, సురక్షితంగా ఉందన్నారు. మూడో సారి కూడా కేసీఆరే సీఎం అవుతారని జోస్యం చెప్పారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ నాయకులకు సీఎం అవకాశం రాలేదని, ఎవరో ఇద్దరు, ముగ్గురికి వస్తే వారిని ఐదేండ్లు పని చేయకుండా మధ్యలోనే సాగనంపారన్నారు. తెలంగాణ వచ్చాక సుమారు పదేండ్లుగా ఒకే ఒక వ్యక్తి కేసీఆరే సీఎంగా ఉన్నారన్నారు. రేవంత్రెడ్డి ఫ్రస్టేషన్లో సీఎం కేసీఆర్పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలంతా కేసీఆర్వైపే ఉన్నారని సుఖేందర్రెడ్డి చెప్పారు.