హనుమకొండ తహసీల్దార్​ గుండెపోటుతో మృతి

హనుమకొండ తహసీల్దార్​ గుండెపోటుతో మృతి

హనుమకొండ సిటీ, వెలుగు: గుండెపోటుతో హనుమకొండ తహసీల్దార్​ కర్ర శ్రీపాల్ రెడ్డి శుక్రవారం ఉదయం చనిపోయారు. ఇటీవల కాలికి గాయం కావడంతో సెలవుపై వెళ్లిన ఆయన వారం రోజుల కింద తిరిగి విధుల్లో చేరారు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచారు. విధి నిర్వహణలో శ్రీపాల్ రెడ్డి తనదైన ముద్ర వేయగా.. ఆయన మరణం పట్ల తహసీల్దార్లు, రెవెన్యూ ఆఫీసర్లు సంతాపం తెలిపారు. కాగా, శ్రీపాల్ రెడ్డి మృతదేహానికి వరంగల్  వెస్ట్  ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ కలెక్టర్  ప్రావీణ్య, అధికారులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. శ్రీపాల్ రెడ్డి మృతి బాధాకరమని ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేశారు.