అయోధ్య రామయ్యకు హనుమాన్ చిత్ర యూనిట్ భారీ విరాళం

అయోధ్య రామయ్యకు హనుమాన్ చిత్ర యూనిట్ భారీ విరాళం

అయోధ్య రామయ్యకు ‘హనుమాన్’ చిత్ర యూనిట్ భారీ విరాళం ప్రకటించింది. ఈ సినిమాకి అమ్ముడైన ప్రతి టికెట్ నుంచి రూ. 5 చొప్పున రామయ్యకు అందివ్వనున్నట్లు ముందుగానే తెలిపింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రూ. రెండున్నర కోట్లకు పైగా విరాళం ఇచ్చి ‘హనుమాన్’ టీమ్ అందరి మనసులను గెలుచుకుంది. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ టాక్‌‌ను తెచ్చుకుంది.  

ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల మార్కును క్రాస్ చేసిన ఈ సినిమా వీక్ డేస్‌‌లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో మేకర్స్ ప్రకటించినట్టుగానే  సినిమాకు ఇప్పటి వరకు విక్రయించిన 53,28,211 టిక్కెట్ల నుంచి రూ.2,66,41,055 అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా  ‘హనుమాన్‌‌ ఫర్‌‌ శ్రీరామ్‌‌’ అంటూ స్పెషల్ పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు.