కేబీఆర్ పార్కులో మహిళా సినీ నిర్మాతకు వేధింపులు

కేబీఆర్ పార్కులో మహిళా సినీ నిర్మాతకు వేధింపులు

బంజారాహిల్స్​లోని కేబీఆర్​ పార్క్​లో ఓ మహిళా సినీ నిర్మాతను వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జులై 9న ఆ నిర్మాత కేబీఆర్​ పార్క్​లో జాగింగ్​ చేస్తున్నారు. అకస్మాత్తుగా ఓ వ్యక్తి వచ్చి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అశ్లీల హావభావాలు ప్రదర్శించాడు. ఫోన్​కెమెరాతో ఫొటోలు తీయడానికి ప్రయత్నించాడు. గంట వ్యవధిలో మూడు సార్లు ఇలా జరిగింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కారు నంబర్.. తదితర ఆనవాళ్లను పోలీసులకు ఇచ్చారు. 

వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వీఐపీలతో పాటు మార్నింగ్ వాకింగ్​కి  ప్రసిద్ధి చెందిన కేబీఆర్ పార్క్‌లో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. 2022 ఏప్రిల్‌లో మార్నింగ్ వాక్ చేస్తున్న 45 ఏళ్ల మహిళపై ఇద్దరు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.  నవంబర్ 2021లో, టాలీవుడ్ నటి షాలు చౌరసియా ఈవినింగ్ వాక్ చేస్తున్నప్పుడు దాడి చేసి దోచుకున్నారు. దాడిని ప్రతిఘటించే క్రమంలో ఆమెకు గాయాలయ్యాయి. అదే నెలలో గుర్తు తెలియని వ్యక్తి తనను వేధించి రూ.2 వేల 500 లాక్కెళ్లాడని మరో మహిళ ఫిర్యాదు చేసింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే ఈ పరిస్థితి ఉండటం మహిళా భద్రతపై సవాళ్లు లేవనెత్తుతోంది.

ఆ యంగ్ సినీ మహిళా నిర్మాత ఎవరు అనేది పోలీసులు కూడా వెల్లడించటం లేదు. దీంతో ఎవరు ఆమె అనే చర్చ సినీ ఇండస్ట్రీలో జోరుగా సాగుతుంది.