
‘హరి హర వీరమల్లు’ నిర్మాత AMరత్నం తీవ్ర అస్వస్థతకు గురయ్యారంటూ వార్తలు వ్యాపించాయి. ఇవాళ ఉదయం ఆయన కళ్లు తిరిగి పడిపోవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లుగా ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే AM రత్నం సోదరుడు నిర్మాత దయాకర్ రావు క్లారిటీ ఇచ్చాడు.
‘‘అన్నయ్య ఆరోగ్యం బాలేదంటూ వస్తోన్న రూమర్స్ నమ్మకండి. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. దయచేసి ఇలాంటి రూమర్స్ను సోషల్ మీడియాలో ప్రచారం చేయకండి’’ అని పోస్ట్ పెట్టారు. ఈ ఒక్క పోస్టుతో నెటిజన్లకు క్లారిటీ వచ్చింది.
Don't believe the rumors about Annayya @AMRathnamOfl falling unconscious. He is perfectly healthy and doing well. Please avoid spreading misinformation.
— A Dayakar Rao (@ADayakarRao2) May 30, 2025
హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో నిర్మాత AM రత్నం వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఓ వైపు సాంగ్స్, రిలీజ్ పనులు, ప్రెస్మీట్లు నిర్వహిస్తూ ఏ మాత్రం ఖాళీగా ఉండట్లేదు. ఈ క్రమంలోనే నిర్మాత AM రత్నం అధిక బీపీ కారణంగా స్పృహ తప్పి పడిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై దయాకర్ రావు పోస్ట్ పెట్టడంతో రూమర్స్కి బ్రేక్ పడింది.
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ పీరియాడిక్ మూవీని దర్శకుడు క్రిష్ కొంత భాగాన్ని తెరకెక్కించగా, జ్యోతి కృష్ణ బ్యాలెన్స్ షూట్ను చిత్రీకరించాడు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏఎమ్ రత్నం సమర్పణలో ఎ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ‘హరిహర వీరమల్లు : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో జూన్ 12న విడుదల కానుంది.
#HariHaraVeeraMallu has all the commercial elements, yet it delivers a good message by the end of the movie! - @AMRathnamOfl
— Hari Hara Veera Mallu (@HHVMFilm) May 29, 2025
The power storm hits cinemas worldwide on JUNE 12th! 🌪️🔥#HHVMonJune12th #HHVM #DharmaBattle #VeeraMallu pic.twitter.com/kXLovYdvEh