ఈ హత్య నా కొడుకు ఒక్కడే చేసి ఉండడు : నిందితుడి తండ్రి

ఈ హత్య నా కొడుకు ఒక్కడే చేసి ఉండడు : నిందితుడి తండ్రి

నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణ రెగ్యులర్ గా సీఐడీ క్రైమ్ స్టోరీస్ చూసేవాడని అతని తండ్రి ప్రభాకర్ వెల్లడించారు. నవీన్ ను హత్య చేసిన తర్వాత ఈ నెల 23న  హరిహరకృష్ణ తన దగ్గర నేరం అంగీకరించాడని చెప్పారు. హత్య విషయం తెలిశాక పోలీసులకు లొంగిపోవాలని తానే హరికృష్ణకు చెప్పినట్లు వివరించారు. ఈ కేసులో తన కొడుకుకి చట్టరిత్యా ఏ శిక్ష వేసినే తమకు అంగీకరమేనన్నారు. నవీన్ తల్లిదండ్రుల బాధ తాను అర్ధం చేసుకోగలనని హరిహరకృష్ణ తండ్రి చెప్పారు. ఆ కుటుంబానికి  క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. తన కొడుకు ఒక్కడే ఈ నేరం చేసి ఉండడని..దీని వెనుక ఇంకెవరైనా ఉండొచ్చననే అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు మరింత విచారణ చేయాలన్నారు.