
- రాజస్థాన్లో 24 అంతస్తులఆస్పత్రి తెల్వదా
- టిమ్స్హాస్పిటల్స్నిర్మాణం త్వరగా పూర్తిచేయాలి
హైదరాబాద్:గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విషం చిమ్మడం బాధాకరమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ వేదికగా కోమటిరెడ్డిపై ఫైర్అయ్యారు. ‘జనాభా అవసరాలకు అనుగుణంగా, అత్యాధునిక, నాణ్యమైన వైద్యాన్ని పేదలకు అందించేందుకు హైదరాబాద్ నలువైపులా టిమ్స్ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా వేగంగా అడుగులు వేసింది. 5 నెలలుగా ఆ నిర్మాణాలను, పనుల పర్యవేక్షణను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, లేని పోని ఆరోపణలు చేస్తున్నది.
ఆస్పత్రులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఆలోచన పక్కనపెట్టి రాజకీయాలు చేస్తున్నది. టిమ్స్ ఆస్పత్రుల పట్ల కనీస అవగాహన కూడా లేకుండా ఆర్ అండ్ బీ శాఖ మంత్రి మాట్లాడటం దురదృష్టకరం. టిమ్స్ ఎల్బీనగర్ హాస్పిటల్నిర్మాణం జి+14 అంతస్తులు మాత్రమే అయితే 27 అంతస్తులు అని మాట్లాడడం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవగాహన రాహిత్యానికి నిదర్శనం.
ఎక్కువ అంతస్తులు ఉంటే పేషెంట్లు ఇబ్బంది పడతారని ముసలి కన్నీరు కార్చుతున్న మంత్రికి, ఏప్రిల్ 5, 2022న జైపూర్ లో నాటి రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నిర్మిస్తున్న 24 అంతస్తుల ఆస్పత్రికి ఎందుకు కనిపించడం లేదు.? సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో కడుతున్న 22 అంతస్తుల హాస్పిటల్ఎందుకు కనిపించడం లేదు? నిజంగా పేదలకు మంచి చేయాలనే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే, త్వరితగతిన టిమ్స్ ఆస్పత్రి నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్య సదుపాయాలు పెంచాలి. అంతేగాని చవకబారు వ్యాఖ్యలు చేసి స్థాయిని మరింత తగ్గించుకోవద్దు’ అని హరీశ్రావు సూచించారు.